పర్సనల్ గా ఇంపోర్ట్ చేసుకునే బుక్స్ కు పర్మిషన్ అక్కర్లేదు...
- February 19, 2021
ఒమన్:వ్యక్తిగత అవసరాలు, సొంత వినియోగానికి విదేశాల నుంచి తెప్పించుకునే పుస్తకాలకు ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేదని ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే..పబ్లికేషన్, డిస్ట్రిబ్యూషన్ కోసం ఇంపోర్ట్ చేసుకునే పుస్తకాలకు మాత్రం మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని కూడా క్లారిటీ ఇచ్చింది. సుల్తానేట్లోని కొన్ని షిప్పింగ్ కంపెనీలు కొన్ని తమ వినియోగదారులకు చేస్తున్న సూచనలు ఇంపోర్టెడ్ బుక్స్ పై గందరగోళాన్ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బుక్స్, మెడిసిన్, మొబైల్ డివైజ్లు షిప్మేట్ చేసుకునే వినియోగదారులు కొంచెం అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే వాటి రవాణాకు మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి అంటూ షిప్పింగ్ కంపెనీలు వినియోగదారులకు మెయిల్ చేశాయి. దీంతో బుక్స్ ఇంపోర్ట్ పై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అవ్వటంతో స్పందించిన మంత్రిత్వ శాఖ సొంత వినియోగానికి ఇంపోర్ట్ చేసుకునే బుక్స్ కు ఎలాంటి అనుమతులు అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







