పర్సనల్ గా ఇంపోర్ట్ చేసుకునే బుక్స్ కు పర్మిషన్ అక్కర్లేదు...
- February 19, 2021
ఒమన్:వ్యక్తిగత అవసరాలు, సొంత వినియోగానికి విదేశాల నుంచి తెప్పించుకునే పుస్తకాలకు ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేదని ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే..పబ్లికేషన్, డిస్ట్రిబ్యూషన్ కోసం ఇంపోర్ట్ చేసుకునే పుస్తకాలకు మాత్రం మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని కూడా క్లారిటీ ఇచ్చింది. సుల్తానేట్లోని కొన్ని షిప్పింగ్ కంపెనీలు కొన్ని తమ వినియోగదారులకు చేస్తున్న సూచనలు ఇంపోర్టెడ్ బుక్స్ పై గందరగోళాన్ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బుక్స్, మెడిసిన్, మొబైల్ డివైజ్లు షిప్మేట్ చేసుకునే వినియోగదారులు కొంచెం అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే వాటి రవాణాకు మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి అంటూ షిప్పింగ్ కంపెనీలు వినియోగదారులకు మెయిల్ చేశాయి. దీంతో బుక్స్ ఇంపోర్ట్ పై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అవ్వటంతో స్పందించిన మంత్రిత్వ శాఖ సొంత వినియోగానికి ఇంపోర్ట్ చేసుకునే బుక్స్ కు ఎలాంటి అనుమతులు అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్







