బాలీవుడ్ స్టార్స్కి వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్
- February 21, 2021ముంబై: మహరాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు బాలీవుడ్ స్టార్ హీరోలకు వార్నింగ్ ఇస్తున్నారు. దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నా వారు నోరు మెదపడం లేదని, వారు దీనిపై స్పందించి తీరాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ పటోలే బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ను దృష్టిలో ఉంచుకొని మాట్లాడారు. దాంతో ముంబై పోలీసులు అమితాబ్ బచ్చన్ ఇంటిముందు రక్షణను పెంచారు. ఈ వారంలోనే మహరాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పటోలే బాలీవుడ్ తారలు పెట్రోల్ ధరలపై ఎందుకు మాట్లాడటం లేదనీ, ముఖ్యంగా అమితాబ్, అక్షయ్లను ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు పెరిగితే ట్వీట్లు చేసిన వారు ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదని అన్నారు. వారు దీనిపై స్పందించకపోతే రాష్ట్రంలో వారి సినిమాలు విడుదల కావని, చిత్రీకరణలు కూడా జరపలేరని అన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ మేడే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అజయ్ దేవగన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, అంగీరా ధర్, ఫేమస్ యూట్యూబర్ కారీమినాటి వంటి వారు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా అమితాబ్ మరో సినిమా ‘ఝుండ్’ జూన్ 18న రిలీజ్ కానుంది. మరి ఈ పరిస్థితుల్లో అమితాబ్ ఏం చేస్తారో వేచి చూడాలి.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు