సుల్తాన్ కబూస్ విశ్వవిద్యాలయ విద్యార్ధులకు ఏర్పడనున్న బస్సు సౌకర్యం
- February 26, 2016
అల్ ఖౌద్ ప్రాంతంలో నివసిస్తున్న సుల్తాన్ కబోస్ విశ్వవిద్యాలయ విద్యార్ధులు కొంత సొమ్మును ఆదా చేసుకొనే అవకాశం త్వరలో ఏర్పడనుంది. ఒమాన్ జాతీయ రహదారి సంస్థ ఈ ప్రాంతం నుంచి విశ్వవిద్యాలయం వరకు బస్సు సేవలను విద్యార్ధుల కోసం ప్రారంభించనుంది. కారు లేని పలువురు విద్యార్ధులు నిత్యం ఈ మార్గంలో టాక్సీల పైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇందుకు కిరాయిగా రోజూ కనీసం ఒక రియల్ ను ఖర్ఛు చేయాల్సివస్తుందని విద్యార్ధి సమాఖ్య నేత నసీర్ అల్ హనై వాపోయారు. గతంలో కిరాయి టాక్సీలకు 200 బైసాస్ చెల్లించేవారు ఇంధన ధరలు పెరిగిన కారణంగా ప్రస్తుతం టాక్సీ డ్రైవర్లు 500 బైసాస్ ను అడుగుతున్నారని తెలిపారు. 2016 నాల్గోవ నెలలో ( ఏప్రిల్ ) మ్వసలట్ సంస్థ తన బస్సు సేవలను అల్ ఖౌద్ ప్రాంతం నుంచి సుల్తాన్ కబోస్ విశ్వవిద్యాలయం వరుకు కొనసాగించనుంది. ఈ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో మారు ఈ బస్సులు నడవనున్నాయి. విద్యార్ధి సమాఖ్య ఈ ప్రాంతంలో ఒక అధ్యయనం నిర్వహించి అత్యంత సురక్షవంతమైన ఈ మార్గాన్ని మ్వసలట్ సంస్థను ఎంపిక చేసింది.సుల్తాన్ కబోస్ విశ్వవిద్యాలయ విద్యార్ధులు తమ తమ గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని మ్వసలట్ సంస్థ కోరింది.సాధారణ ప్రయాణికులు ఈ ఏడాది మొదటి 70 రోజులలో మ్వసలట్ సంస్థ బస్సుల ద్వారా 600,000 మంది ప్రయాణించారు. ఈ మార్గంలో రోజుకు సగటున 9 వేల మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోంటూ ఉంటారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







