గల్ఫ్ కార్మికుల వేతన పోరాటం...
- February 22, 2021
తెలంగాణ:గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను (మినిమమ్ రిఫరల్ వేజెస్) ను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్లను రద్దు చేసి, పాత వేతనాలను కొనసాగించాలని గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.
రెండు నెలల క్రితం ఇదే విషయంపై తాము సమర్పించిన వినతి పత్రం పై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తు సమర్పించారు.
గల్ఫ్ జెఏసి ఆధ్వర్యంలో నిర్మల్ లో స్వదేశ్ పరికిపండ్ల, కరీంనగర్ లో మైదం శ్రీనివాస్, సిరిసిల్లలో తోట ధర్మేందర్, జనగామ శ్రీనివాస్ నాయకత్వంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు.
కొత్తగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి కనీస వేతనాలు (మినిమమ్ రిఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం అయిదు నెలల క్రితం సెప్టెంబర్ 2020 లో రెండు సర్కులర్లు జారీ చేసింది.ఖతార్, బహ్రెయిన్, ఓమాన్, యుఎఇ దేశాలకు వెళ్లే కార్మికుల నెలసరి వేతనాలను 200 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 5 వేలు), కువైట్ (245 డాలర్లు), సౌదీ అరేబియా (324 డాలర్లు) కు తగ్గిస్తూ భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
ఈ సర్కులర్ల ప్రకారం అన్ని క్యాటగిరీలను ఒకేగాటన కట్టి కార్మికులకు, వృత్తి నిపుణులకు కనీస వేతనం ఒకే విధంగా నిర్ణయించడం వలన తీవ్ర అన్యాయం జరుగుతున్నదని రవిగౌడ్ అన్నారు. ఈ-మైగ్రేట్ వెబ్ సైటులో అలవెన్సులు గురించి 'నాట్ అవేలబుల్' (సమాచారం అందుబాటులో లేదు) అని పెట్టారు. జీతాలు అమలయ్యే తేదీని 26.06.2015 అని ఐదేళ్ల నాటి పాత డేటు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు, అధ్యయనం చేపట్టకుండా ఏకపక్షంగా ఒక్క కలం పోటుతో జీతాలు తగ్గించడం భారత్ ను 'చీప్ లేబర్' (తక్కువ జీతానికి పనిచేసే కార్మికులు) అడ్డాగా మార్చడమే. ఇది మానవ హక్కుల, కార్మిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇది వెట్టిచాకిరి, బానిసత్వానికి దారి తీస్తుందని రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మార్చిలో ఛలో ఢిల్లీ...
పార్లమెంటు రెండవ విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 8 నుండి ప్రారంభం అవుతున్న సందర్బంగా గల్ఫ్ జెఏసి ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లి ఎంపీలను, కేంద్ర విదేశాంగ మంత్రి డా.ఎస్. జైశంకర్ ను కలిసి కనీస వేతనాల తగ్గింపు సర్కులర్లను రద్దు చేయాలని కోరుతామని రవిగౌడ్ తెలిపారు. ఈ సర్కులర్ల వలన ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 90 లక్షల మంది భారతీయ కార్మికుల ఆదాయంపై ప్రభావం పడుతుందని, సమస్య తీవ్రతను వివరిస్తామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







