డిజిటైజేషన్: అన్ని సర్వీస్ సెంటర్లను మూసివేసిన యూఏఈ మినిస్ట్రీ
- February 22, 2021
యూఏఈ:యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, తమ విభాగానికి సంబంధించిన అన్ని సర్వీస్ సెంటర్లను డిజిటైజేషన్ ప్రక్రియ నేపథ్యంలో మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విభాగాల్ని డిజిటైజ్ చేసే క్రమంలో కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లను మూసివేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. 2021 జనవరిలో యూఏఈ మినిస్టీరియల్ డెవలప్మెంట్ కౌన్సిల్, 50 శాతం ఫెడరల్ గవర్నమెంట్ సర్వీస్ సెంటర్ల తగ్గింపు దిశగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండేళ్ళలోపు వీటిని డిజిటల్ ప్లాట్ఫామ్స్గా మార్చాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. తొలి ఫేజ్లో మొత్తం 282 సర్వీసు సెంటర్లను డిజిటైజ్ చేస్తారు. వీటిల్లో 59 సెంటర్లను 2021 తొలి క్వార్టర్లోనే మార్చుతారు. మిగిలినవన్నీ 2021-2022లో మూసివేయడం జరుగుతుంది. దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ కూడా తమ కస్టమర్ కేర్ సెంటర్ను (డ్రాగన్ మార్ట్ 2 వద్ద) మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







