డిజిటైజేషన్: అన్ని సర్వీస్ సెంటర్లను మూసివేసిన యూఏఈ మినిస్ట్రీ
- February 22, 2021యూఏఈ:యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, తమ విభాగానికి సంబంధించిన అన్ని సర్వీస్ సెంటర్లను డిజిటైజేషన్ ప్రక్రియ నేపథ్యంలో మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విభాగాల్ని డిజిటైజ్ చేసే క్రమంలో కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లను మూసివేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. 2021 జనవరిలో యూఏఈ మినిస్టీరియల్ డెవలప్మెంట్ కౌన్సిల్, 50 శాతం ఫెడరల్ గవర్నమెంట్ సర్వీస్ సెంటర్ల తగ్గింపు దిశగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండేళ్ళలోపు వీటిని డిజిటల్ ప్లాట్ఫామ్స్గా మార్చాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. తొలి ఫేజ్లో మొత్తం 282 సర్వీసు సెంటర్లను డిజిటైజ్ చేస్తారు. వీటిల్లో 59 సెంటర్లను 2021 తొలి క్వార్టర్లోనే మార్చుతారు. మిగిలినవన్నీ 2021-2022లో మూసివేయడం జరుగుతుంది. దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ కూడా తమ కస్టమర్ కేర్ సెంటర్ను (డ్రాగన్ మార్ట్ 2 వద్ద) మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..