ఇక గర్భిణిలకు, పాలిచ్చే తల్లులకు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్
- February 26, 2021బహ్రెయిన్: ఇక నుంచి పాలిచ్చే తల్లులకు, గర్భిణిలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఇన్నాళ్లు వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు వ్యాక్సిన్ వేసుకునేందుకు సంసిద్ధంగా ఉన్న ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ అందించారు. గర్భిణిలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు, 16 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే..ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అమెరికా రోగ నియంత్రణ కేంద్రం నుంచి వచ్చిన సూచనలు, సలహాలను స్టడీ చేసిన తర్వాత గర్భిణిలు, పాలిచ్చే తల్లులకు కూడా వ్యాక్సిన్ అందించటం ప్రమాదమేమి కాదనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్ తో వారికి కూడా తగిన రక్షణ లభిస్తుందని తెలిపింది. అంతేకాదు..ఇన్నాళ్లు వ్యాక్సిన్ తీసుకునే వారికి ప్రభుత్వం ఏ వ్యాక్సిన్ అందిస్తే ఆ వ్యాక్సిన్నే తీసుకోవాల్సి వచ్చేది. లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది కాదు. అయితే..గర్భిణులు, పాలిచ్చే తల్లులు మాత్రం సినోఫామ్, ఫైజర్ టీకాలలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చని కూడా బహ్రెయిన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..