చిరు మెగా యూత్ ఫోర్స్ రక్తదానం
- February 27, 2016
రెండు దశాబ్దాలకు పైగా రక్తదాన కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది చిరు మెగా యూత్ పోర్స్ (సిఎంవైఎఫ్). రామదాస్ చందిక తొలిసారిగా 15 మందితో స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఒమన్లో 2001లో ప్రారంభమైన ఈ సంస్థ, రక్తదాన కార్యక్రమాలు చేపడుతూ, తన సభ్యుల సంఖ్యను 200 మందికి పైగా విస్తరించుకోగలిగింది. బాషర్లోని సెంట్రల్ బ్యాంక్ వద్ద ప్రతి యేడాదీ రక్తదానం చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బెస్ట్ బ్లడ్ డోనర్ టీమ్గా సీఎంవైఎఫ్ని ప్రకటించింది. ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో ఏ గ్రూపు రక్తం అవసరమైనా వెంటనే సిఎంవైఎఫ్ని సంప్రదించడం పరిపాటిగా మారింది. రక్తదానం మాత్రమే కాకుండా, పలు సేవా కార్యక్రమాల్లోనూ తమ సంస్థ ముందుంటుందని చందిక చెప్పారు. స్వదేశానికి వెళ్ళేందుకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నవారికి విమాన టిక్కెట్లను కూడా ఈ సంస్థ సమకూర్చింది. చందిక ఒమన్లో చిన్న వ్యాపారం నిర్వహిస్తూ వస్తున్నారు. రక్తదానం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని ఆదుకుంటుందనీ, దాని ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావని చందిక చెబుతున్నారు. రక్తదానం సామాజిక బాధ్యత అనీ, రక్తదానం దైవకార్యంతో సమానమని ఆయన అంటారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







