చిరు మెగా యూత్ ఫోర్స్ రక్తదానం
- February 27, 2016
రెండు దశాబ్దాలకు పైగా రక్తదాన కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది చిరు మెగా యూత్ పోర్స్ (సిఎంవైఎఫ్). రామదాస్ చందిక తొలిసారిగా 15 మందితో స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఒమన్లో 2001లో ప్రారంభమైన ఈ సంస్థ, రక్తదాన కార్యక్రమాలు చేపడుతూ, తన సభ్యుల సంఖ్యను 200 మందికి పైగా విస్తరించుకోగలిగింది. బాషర్లోని సెంట్రల్ బ్యాంక్ వద్ద ప్రతి యేడాదీ రక్తదానం చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బెస్ట్ బ్లడ్ డోనర్ టీమ్గా సీఎంవైఎఫ్ని ప్రకటించింది. ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో ఏ గ్రూపు రక్తం అవసరమైనా వెంటనే సిఎంవైఎఫ్ని సంప్రదించడం పరిపాటిగా మారింది. రక్తదానం మాత్రమే కాకుండా, పలు సేవా కార్యక్రమాల్లోనూ తమ సంస్థ ముందుంటుందని చందిక చెప్పారు. స్వదేశానికి వెళ్ళేందుకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నవారికి విమాన టిక్కెట్లను కూడా ఈ సంస్థ సమకూర్చింది. చందిక ఒమన్లో చిన్న వ్యాపారం నిర్వహిస్తూ వస్తున్నారు. రక్తదానం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని ఆదుకుంటుందనీ, దాని ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావని చందిక చెబుతున్నారు. రక్తదానం సామాజిక బాధ్యత అనీ, రక్తదానం దైవకార్యంతో సమానమని ఆయన అంటారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









