వీడియో లింక్ ద్వారా కోర్టుకు హాజరైన ఆంగ్ సాన్ సూకీ
- March 01, 2021
నైపితా: ఆర్మీ నిర్బంధంలో ఉన్న మయన్మార్ ఉద్యమనేత ఆంగ్ సాన్ సూకీ ఇవాళ కోర్టు విచారణకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అయితే ఆమె ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మయన్మార్లోని ఆర్మీ.. సైనిక తిరుగుబాటుకు పాల్పడింది. ఆ దేశ అగ్రనేతలను సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సూకీ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. గుర్తు తెలియని లొకేషన్ నుంచే ఆమె కోర్టుకు వీడియో లింకు ద్వారా హాజరయ్యారు. సైనిక తిరుగుబాటు జరిగిన నాటి నుంచి ఆ దేశంలో అల్లర్లు హెచ్చుమీరాయి. ఇప్పటి వరకు ఆ నిరసనల్లో 18 మంది మృతిచెందారు. సూకీతో పాటు నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీకి చెందిన ఇతర నేతలను తక్షణమే రిలీజ్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోసం జరిగిందని, దాని వల్లే ఎన్ఎల్డీ విజయం సాధించినట్లు ఆర్మీ ఆరోపిస్తున్నది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







