వీడియో లింక్ ద్వారా కోర్టుకు హాజరైన ఆంగ్ సాన్ సూకీ
- March 01, 2021నైపితా: ఆర్మీ నిర్బంధంలో ఉన్న మయన్మార్ ఉద్యమనేత ఆంగ్ సాన్ సూకీ ఇవాళ కోర్టు విచారణకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అయితే ఆమె ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మయన్మార్లోని ఆర్మీ.. సైనిక తిరుగుబాటుకు పాల్పడింది. ఆ దేశ అగ్రనేతలను సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సూకీ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. గుర్తు తెలియని లొకేషన్ నుంచే ఆమె కోర్టుకు వీడియో లింకు ద్వారా హాజరయ్యారు. సైనిక తిరుగుబాటు జరిగిన నాటి నుంచి ఆ దేశంలో అల్లర్లు హెచ్చుమీరాయి. ఇప్పటి వరకు ఆ నిరసనల్లో 18 మంది మృతిచెందారు. సూకీతో పాటు నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీకి చెందిన ఇతర నేతలను తక్షణమే రిలీజ్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోసం జరిగిందని, దాని వల్లే ఎన్ఎల్డీ విజయం సాధించినట్లు ఆర్మీ ఆరోపిస్తున్నది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ