BREAKING!! వీసాల గడువు పొడిగింపు
- March 01, 2021
అబుధాబి: టూరిస్ట్ వీసా గడువు ముగిసిపోవడం ఇబ్బందులకు గరవుతున్న పర్యాటకులకు యూఏఈ తీపి కబురు చెప్పింది. వీసాల గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. గడువు తీరిపోయిన.. నెల, మూడు నెలల విజిట్ వీసాలు, టూరిస్ట్ వీసాల కాలపరిమితిని మార్చి 31 వరకు పొడగిస్తున్నట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెన్ అఫైర్స్ (జీడీఆర్ఎప్ఏ) ప్రకటించిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇదే విషయాన్ని ట్రావెల్ ఏజెట్లు కూడా స్పష్టం చేశారు. ‘మా క్లైంట్ల దుబాయ్ వీసాల గడువు మార్చి 31 వరకు అక్కడి ప్రభుత్వం పొడగించింది. ఈ విషయం మా దృష్టికి వచ్చింది’ అని పేర్కొన్నారు. కాగా.. నెల రోజులపాటు వీసాల గడువును ఉచితంగా పొడగించనున్నట్టు.. యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ డిసెంబర్ 27 వెల్లడించిన విషయం తెలిసిందే. యూరప్ దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తుండటం, అక్కడి దేశాలు తిరిగి లాక్డౌన్లను విధిస్తుండటంతో ఇది అమలులోకి వచ్చింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







