టర్కీలో ఘోర ప్రమాదం..
- March 05, 2021
అంకారా:టర్కీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్నేయ టర్కీలోని బిట్లిస్ ప్రావిన్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో లెఫ్టినెంట్ జనరల్ ఉస్మాన్ ఎర్బాస్ కూడా ఉన్నారని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న మధ్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలినట్లు గుర్తించారు.హెలికాప్టర్లో మొత్తం 13 మంది సైనికులు ఉన్నారు.
హెలి కాప్టర్ బయలు దేరిన 30 నిమిషాల తరువాత బిట్లిస్ ప్రావిన్యు ప్రాంతంలో హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోయాయని.. ప్రావిన్యులోని పర్వత ప్రాంతంలో మంచు, దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని టర్కీ దేశ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఘటనా స్థలంలోనే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య పదకొండుకు చేరింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఇద్దరు సైనికులకు చికిత్స అందుతోంది. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ ఉస్మాన్ ఎర్బాస్ మృతిపట్ల ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తున్నానని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







