భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 05, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది.ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 16,838 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,73,761కి చేరింది.ఇందులో 1,08,39,894 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,76,319 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 113 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,57,548కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 13,819 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.కోలుకున్న వారి సంఖ్య కంటే కొత్త కేసులు అధికంగా ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది.ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది.ఇప్పటి వరకు 1,80,05,503 మందికి వ్యాక్సిన్ ను అందించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







