తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- March 05, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది.కేరళ, మహారాష్ట్రలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.ఇక ఇదిలా ఉంటె, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో తాజాగా 166 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,572కి చేరింది. ఇందులో 2,95,970 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1963 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.అయితే, తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు కరోనాతో మృతి చెందారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1639గా ఉన్నది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!