భారత్ లో కరోనా కేసుల వివరాలు

- March 07, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.తగ్గినట్టే తగ్గి తిరిగి కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.ఇక తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 18,711 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,10,799కి చేరింది.ఇందులో 1,08,68,520 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.1,84,523 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక దేశంలో కొత్తగా 100 కరోనా మరణాలు సంభవించాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,57,756కి చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com