రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా!
- March 07, 2021న్యూయార్క్: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సినిమాల్లోనే కాకుండానే వ్యాపారం రంగంలోను దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె న్యూయార్క్లో ‘సోనా’ అనే రెస్టారెంట్ను ప్రారంభించారు. ఇది ఈ నెల చివరి వరకు అందరికీ అందుబాటులోకి రానుందని ప్రియాంక తెలిపారు. భర్త నిక్ జోనస్, తల్లి మధుచోప్రాలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కొత్త రెస్టారెంట్కు ప్రముఖ చెఫ్ హరినాయక్ ప్రధాన చెఫ్గా ఉంటారని పేర్కొన్నారు.
అనేక వెరైటీల ద్వారా రుచికరమైన భారత రుచులను అందించేందుకు థ్రిల్గా ఫీలవుతున్నట్లు చెప్పారు. ఈ రెస్టారెంట్ను తన మిత్రులు మనీష్ గొయల్, డేవిడ్ రాబిన్ చూసుకొంటారన్నారు. కాగా, ప్రియాంకకు కుటుంబ సభ్యులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇదిలా వుంటే ప్రియాంక చోప్రా ప్రస్తుతం 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ను లండన్లో చిత్రీకరిస్తోంది. ఇక ప్రియాంక ఇప్పటికే నటి, నిర్మాత, గాయనిగానూ మంచిపేరు గడించిన విషయం తెలిసిందే!
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు