మహిళలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
- March 07, 2021
హైదరాబాద్:మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.రేపు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను సీఎం ఆదేశించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు.సీఎం ఆదేశాలతో సీఎస్ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ సర్క్యూలర్ జారీ చేశారు.మహిళా సంక్షేమంలో తెలంగాణ ముందంజలో ఉందని సిఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహిళా సాధికారత కేంద్రంగా పని చేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం అని అన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్, వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అంగన్వాడీ, ఆశావర్కర్లకు వేతనాల పెంపు సహా వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వి-హబ్ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







