సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్ జరుపుకుంటున్న ‘ఆచార్య’
- March 07, 2021తెలంగాణ:మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.రాంచరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.రాంచరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పూజా హెగ్డేతో షూటింగ్ పూర్తి చేసుకున్న రాంచరణ్.. తాజాగా తండ్రి చిరంజీవితో కలిసి ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో కనిపించారు.ఈ తాజా షెడ్యూల్ మార్చి 7 మార్చి 15 వరకు షూటింగ్ జరగనుంది. ఇల్లెందులోని జేకే మైన్స్ లో ఓపెన్ కాస్ట్, భూగర్భ గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈమేరకు బొగ్గు గనుల వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు.షూటింగ్ కు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటికి విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి,తనయుడు రామ్ చరణ్ లకి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వాగతం పలికారు.ఈమేరకు మంత్రి పువ్వాడ తన ఇంట్లో బస ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు