సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్ జరుపుకుంటున్న ‘ఆచార్య’
- March 07, 2021తెలంగాణ:మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.రాంచరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.రాంచరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పూజా హెగ్డేతో షూటింగ్ పూర్తి చేసుకున్న రాంచరణ్.. తాజాగా తండ్రి చిరంజీవితో కలిసి ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో కనిపించారు.ఈ తాజా షెడ్యూల్ మార్చి 7 మార్చి 15 వరకు షూటింగ్ జరగనుంది. ఇల్లెందులోని జేకే మైన్స్ లో ఓపెన్ కాస్ట్, భూగర్భ గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈమేరకు బొగ్గు గనుల వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు.షూటింగ్ కు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటికి విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి,తనయుడు రామ్ చరణ్ లకి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వాగతం పలికారు.ఈమేరకు మంత్రి పువ్వాడ తన ఇంట్లో బస ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి