శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- March 08, 2021
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.ఇవాళ ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో 2.3 కిలోల బంగారం లభించింది.ముందస్తు సమాచారంతో కస్టమ్స్ అధికారులు విమానాన్ని తనిఖీ చేశారు.ఈ క్రమంలో సీటు కింద ఉన్న లైఫ్ జాకెట్లో బంగారు బిస్కెట్లను గుర్తించారు.దీంతో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటనలో కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్నషేక్ మస్తాన్ అనే ప్రయాణికుడి వద్ద బంగారం లభ్యమైంది. పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు చేశారు. తనిఖీల్లో అక్రమంగా బంగారాన్ని లోదుస్తుల్లో తరలిస్తున్న నిందితుడి మస్తాన్ని కస్టమ్ అధికారులు గుర్తించారు.నిందితుడి వద్ద ఉన్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







