ప్రతిరోజూ జాతీయ పతాకావిష్కరణ జరపాలని కెవిఎస్ ఆదేశాలు
- February 28, 2016
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రతిరోజూ జాతీయ పతాకావిష్కరణ జరపాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) ఆదేశాలు జారీ చేసింది. సెంట్రల్ యూనివర్శిటీలు తమ ప్రాంగణాల్లో రోజూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయించిన కొద్ది రోజులకే కెవిఎస్ ఈ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు త్రివర్ణ పతాకానికి వందనం చేయడానికి వీలుగా ఉండేలా విద్యార్థులు రోజూ ప్రార్థన చేసే ప్రదేశంలో ప్రముఖంగా కనిపించేలా పతాకాన్ని ఎగురవేయాలని కెవిఎస్ అడిషనల్ కమిషనర్ యుఎన్ ఖవారే పేర్కొన్నారు.
ఉదయం పతాకావిష్కరణ చేసి, సాయంత్రం సూర్యాస్తమయంలోగా అవనతం చేయాలని కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాల్స్కు ఖవారే ఒక లేఖ రాశారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కెవిఎస్కు ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







