ప్రతిరోజూ జాతీయ పతాకావిష్కరణ జరపాలని కెవిఎస్ ఆదేశాలు
- February 28, 2016
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రతిరోజూ జాతీయ పతాకావిష్కరణ జరపాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) ఆదేశాలు జారీ చేసింది. సెంట్రల్ యూనివర్శిటీలు తమ ప్రాంగణాల్లో రోజూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయించిన కొద్ది రోజులకే కెవిఎస్ ఈ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు త్రివర్ణ పతాకానికి వందనం చేయడానికి వీలుగా ఉండేలా విద్యార్థులు రోజూ ప్రార్థన చేసే ప్రదేశంలో ప్రముఖంగా కనిపించేలా పతాకాన్ని ఎగురవేయాలని కెవిఎస్ అడిషనల్ కమిషనర్ యుఎన్ ఖవారే పేర్కొన్నారు.
ఉదయం పతాకావిష్కరణ చేసి, సాయంత్రం సూర్యాస్తమయంలోగా అవనతం చేయాలని కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాల్స్కు ఖవారే ఒక లేఖ రాశారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కెవిఎస్కు ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









