రేపు ‘మేజర్’ అనౌన్స్ మెంట్
- March 14, 2021హైదరాబాద్:‘ఎవరు’,‘క్షణం’, ‘గూఢచారి’ వంటి చిత్రాల ద్వారా తానేంటో నిరూపించుకున్నాడు హీరో అడవి శేషు.ఈ సినిమాల తర్వాత ‘మేజర్’ సినిమా వస్తుండడంతో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సూపర్ మహేష్ కు చెందిన బీఎంజీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు సోనీ పిక్చర్స్ శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శశికిరణ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.శోభిత ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.2006లో ముంబైలో పాకిస్తాన్ టెర్రరిస్టులు సాగించిన ఉగ్రదాడిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణించాడు. ఆయన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాను వచ్చే జూలై 2న రిలీజ్ చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు.రేపు ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా సాయంత్రం 4 గంటలకు మేజర్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!