దోహా ఖతార్ లో జనసేన పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవం..
- March 15, 2021దోహా:ఖతార్ దేశంలో గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో ఘనంగా 7వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.ఖతార్-జనసేన కోర్ కమిటీ నాయకులు శ్రీకాంత్ కొమ్ముల,వీర బాబు,దొర,సత్యం మేడిది మరియు కమిటీ సభ్యులు గౌతమ్ కొమ్మిశెట్టి, వెంకట సురేష్, అప్పలనాయుడు ,జానకి రామ్,వంశీ కృష్ణ, రాజు, కోటి, లక్ష్మణ ప్రసాద్, సుధాకర్, ఇంకా మహిళలు -హరి ప్రియ,నీలిమ,మణి, సాహిత్య,వాణి, శేషవేణి, శిరీష రామ్ ,అనిల్ ఓరుగంటి,రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంధర్భంగా సత్యం మేడిది మాట్లాడుతూ పంచాయతీ,మున్సిపల్ ఎన్నికల్లోవిజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ విజయం ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.
మార్పు ప్రారంభం అయిందని,ఆంధ్రప్రదేశ్ ప్రజలు జన సేనాని పవన్ కళ్యాణ్ వెంట నడువడానికి సిధ్ధంగా ఉన్నారనడానికి ఈ ఎన్నికల ద్వారా రుజువు అయిందన్నారు.గత తెలుగు దేశం ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి ని గాలికి వదిలేసి కేవలం తమ రాజకీయ లబ్ది కోసం,కేసులో మాఫీ కై కేంద్ర ప్రభుత్వం తో కుమ్మక్కై విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తున్నారని,జనసేన దీనికి వ్యతిరేకంగా పోరాడుతుందని.ఎన్నారై విభాగాల ఆధ్వర్యంలో ఈ విషయం పై ఉద్యమిస్తామని హెచ్చరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు