ఉమ్రా: 70 ఏళ్ళ వయసు వరకు స్వదేశీ యాత్రీకులకు అనుమతి
- March 18, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా వెల్లడించిన వివరాల ప్రకారం 18 నుంచి 70 ఏళ్ళ వయసుగల డొమెస్టిక్ యాత్రీకులకు ఉమ్రా ప్రార్థనల కోసం అనుమతించనున్నట్లు తెలుస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ జారీ చేసిన సూచనల మేరకు తగు మార్గదర్శకాల్ని యాత్రీకులు పాటించాల్సి వుంటుంది. ఈతమర్నా అప్లికేషన్ వున్నవారు, ప్రస్తుత పరిమితి గడువు తీరాక తిరిగి ఉమ్రా ప్రార్థనల్లో పాల్గొనవచ్చు. ఇందుకోసం వారికి ప్రత్యేక పర్మిట్ జారీ చేయబడుతుంది. ప్రస్తుత విధానం ప్రకారం ప్రతి 15 రోజులకు ఓ సారి ఉమ్రా అనుమతి జారీ చేయబడుతుంది. కాగా, రవాణా సదుపాయి అనేది ఆప్షనల్. 2020 నవంబర్ 1 నుంచి ఉమా ప్రార్థనల కోసం డొమెస్టిక్ అలాగే అంతర్జాతీయ యాత్రీకులకు అనుమతినిస్తున్నారు. 20,000 మంది ఉమ్రా యాత్రీకులకు ఉమ్రా కోసం అనుమతినివ్వడం జరిగిందనీ, 60,000 మంది గ్రాండ్ మసీదులో ప్రార్థనలు పూర్తి చేసుకున్నారనీ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







