ఫేస్ మాస్క్ ధరించని 61,051 మందిపై కేసు నమోదు
- March 21, 2021
బహ్రెయిన్:కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై బహ్రెయిన్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించకపోయినా, ఫేస్ మాస్కులు ధరించకపోయినా వెంటనే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు బహ్రెయిన్ వ్యాప్తంగా ఫేస్ మాస్కులు పెట్టుకోని 61,051 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే భౌతిక దూరం పాటించని 8,579 మందిపై కూడా కేసులు బుక్ చేశారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటించటమే ఉత్తమ మార్గమమని చెబుతున్న అధికారులు కోవిడ్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించింది. ఈ నెల 18 నాటికి 7,023 అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







