హడలెత్తిస్తున్న కుంభమేళా
- March 22, 2021న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కొనసాగుతున్న కుంభమేళా వల్ల కరోనా వ్యాపిస్తోందని, కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి లేఖ రాసింది. కుంభమేళాలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్కు చెందిన బృందం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హరి ద్వార్లో ఈ నెల 16–17 మధ్య పర్యటించింది.
కుంభమేళా జరిగిన షాహి స్నాన్ రోజుల తర్వాత స్థానికుల్లో ఉన్నట్టుండి కరోనా కేసులు పెరిగాయని తెలిపింది. కుంభమేళాకు కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. అవసరమైన మేర టెస్టులు చేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన కరోనా మార్గదర్శకాలను పాటించాలని చెప్పింది. కొత్త కేసుల్లో వేగం కనిపిస్తే వెంటనే జీనోమ్ సీక్వెన్సింగ్కు శాంపిల్స్ పంపాలని కోరింది.
తాజా వార్తలు
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి