మయన్మార్: మితిమీరిన సైనిక ప్రభుత్వం అరాచకాలు
- March 22, 2021యాంగూన్: మయన్మార్లో సైనిక ప్రభుత్వం అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్నవారిని కాల్చివేయాలన్న సైనిక ఆదేశాలతో కొందరు పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ పౌరుడిని వెంబడించిన పోలీసులు ఎటువంటి వివరాలు అడగకుండానే అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని మరికొందరు పోలీసులు వేరే ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యాలు ఓ వ్యక్తి సెల్ఫోన్తో చిత్రీకరించారు.
ఈ ఏదాడి ఫిబ్రవరి 1న మయన్మార్ను అదుపులోకి తీసుకున్న ఆ దేశ సైన్యం అరాచక పాలన కొనసాగిస్తోంది. సైన్యం తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతోంది. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. సైన్యం జరిపిన కాల్పుల్లో వందల సంఖ్యలో మృతిచెందారు. వేల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారు. హింసను ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి హెచ్చరించినా.. వాటిని పెడచెవిన పెట్టిన సైన్యం హింసకు పాల్పడుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు