మయన్మార్: మితిమీరిన సైనిక ప్రభుత్వం అరాచకాలు
- March 22, 2021
యాంగూన్: మయన్మార్లో సైనిక ప్రభుత్వం అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్నవారిని కాల్చివేయాలన్న సైనిక ఆదేశాలతో కొందరు పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ పౌరుడిని వెంబడించిన పోలీసులు ఎటువంటి వివరాలు అడగకుండానే అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని మరికొందరు పోలీసులు వేరే ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యాలు ఓ వ్యక్తి సెల్ఫోన్తో చిత్రీకరించారు.
ఈ ఏదాడి ఫిబ్రవరి 1న మయన్మార్ను అదుపులోకి తీసుకున్న ఆ దేశ సైన్యం అరాచక పాలన కొనసాగిస్తోంది. సైన్యం తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతోంది. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. సైన్యం జరిపిన కాల్పుల్లో వందల సంఖ్యలో మృతిచెందారు. వేల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారు. హింసను ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి హెచ్చరించినా.. వాటిని పెడచెవిన పెట్టిన సైన్యం హింసకు పాల్పడుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









