జాతీయస్థాయి కబడ్డీపోటీల్లో ప్రమాదం.. వందమందికి గాయాలు
- March 22, 2021
సూర్యాపేట పట్టణంలో జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రమాదం జరిగింది. 47వ జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభం సమయంలో కబడ్డీకోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలింది. దీంతో వందమంది పైగా గాయపడ్డారు. కబడ్డీ పోటీలను చూసేందుకు వచ్చిన వారు గాయపడటంతో...వారిని 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. గేమ్ ప్రారంభానికి ముందే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బాధితుల ఆర్ధనాధాలతో ఆ ప్రాంతం అలజడిగా మారింది. ఘటన జరిగిన సమయంలో అక్కడ మంత్రితోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. ఘటన జరిగిన టైమ్లో గ్యాలరీలో 15వందల మంది ప్రేక్షకులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది, పోలీసులు స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ భాస్కరన్ శరవేగంగా స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చోవడం వల్లే గ్యాలరీ కుప్పకూలినట్లు తెలుస్తోంది. కబడ్డీ పోటీలకోసం మొత్తం మూడు గ్యాలరీలను ఏర్పాటుచేశారు.దీంతో తూర్పువైపు ఉన్న గ్యాలరీ కూలిపోయింది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!