జాతీయస్థాయి కబడ్డీపోటీల్లో ప్రమాదం.. వందమందికి గాయాలు
- March 22, 2021
సూర్యాపేట పట్టణంలో జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రమాదం జరిగింది. 47వ జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభం సమయంలో కబడ్డీకోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలింది. దీంతో వందమంది పైగా గాయపడ్డారు. కబడ్డీ పోటీలను చూసేందుకు వచ్చిన వారు గాయపడటంతో...వారిని 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. గేమ్ ప్రారంభానికి ముందే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బాధితుల ఆర్ధనాధాలతో ఆ ప్రాంతం అలజడిగా మారింది. ఘటన జరిగిన సమయంలో అక్కడ మంత్రితోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. ఘటన జరిగిన టైమ్లో గ్యాలరీలో 15వందల మంది ప్రేక్షకులు ఉన్నట్లు తెలుస్తోంది.



ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది, పోలీసులు స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ భాస్కరన్ శరవేగంగా స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చోవడం వల్లే గ్యాలరీ కుప్పకూలినట్లు తెలుస్తోంది. కబడ్డీ పోటీలకోసం మొత్తం మూడు గ్యాలరీలను ఏర్పాటుచేశారు.దీంతో తూర్పువైపు ఉన్న గ్యాలరీ కూలిపోయింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!









