జాతీయస్థాయి కబడ్డీపోటీల్లో ప్రమాదం.. వందమందికి గాయాలు
- March 22, 2021
సూర్యాపేట పట్టణంలో జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రమాదం జరిగింది. 47వ జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభం సమయంలో కబడ్డీకోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలింది. దీంతో వందమంది పైగా గాయపడ్డారు. కబడ్డీ పోటీలను చూసేందుకు వచ్చిన వారు గాయపడటంతో...వారిని 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. గేమ్ ప్రారంభానికి ముందే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బాధితుల ఆర్ధనాధాలతో ఆ ప్రాంతం అలజడిగా మారింది. ఘటన జరిగిన సమయంలో అక్కడ మంత్రితోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. ఘటన జరిగిన టైమ్లో గ్యాలరీలో 15వందల మంది ప్రేక్షకులు ఉన్నట్లు తెలుస్తోంది.



ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది, పోలీసులు స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ భాస్కరన్ శరవేగంగా స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చోవడం వల్లే గ్యాలరీ కుప్పకూలినట్లు తెలుస్తోంది. కబడ్డీ పోటీలకోసం మొత్తం మూడు గ్యాలరీలను ఏర్పాటుచేశారు.దీంతో తూర్పువైపు ఉన్న గ్యాలరీ కూలిపోయింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







