మహాత్మా గాంధీ ఐస్ విగ్రహం...కెనడాలో అద్భుతం
- March 22, 2021
కెనడాలోని ఓ ప్రముఖ హోటల్ వద్ద భారత జాతిపిత గాంధీజీ ఐస్ విగ్రహం ఏర్పాటైంది. రానున్న ఆగస్టు 15 న ఇండియా 75 వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోనుంది. దీన్ని పురస్కరించుకుని క్యూబెక్ సిటీలోని ఈ హోటల్ ఆవరణలో ఏడు అడుగుల ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఇది పూర్తిగా ఐస్ తో తయారవడం విశేషం. మార్క్ లీ పెయిర్ అనే ఐస్ ఆర్టిస్టు ఈ విగ్రహాన్ని రూపొందించాడు. టొరంటో లోని భారత దౌత్య కార్యాలయం ఈ విగ్రహ ఇమేజీని తమ అధికారిక ట్విటర్ లో షేర్ చేస్తూ లాంచింగ్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అంటూ పేర్కొంది. ఈ సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ గురించి వివరించింది. 75 ఏళ్ళ భారత స్వాతంత్య్ర ఉత్సవాల నేపథ్యంలో ప్రధాని మోదీ మార్చి 12 న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ని లాంచ్ చేశారు. ఇప్పుడు కెనడా మన ఇండియాతో బాటు గాంధీజీకి గౌరవ పురస్కరంగా ఈ విగ్రహాన్ని ఈ హోటల్ వద్ద ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్కు అపార డిమాండ్







