పాక్షిక కర్ఫ్యూ సమయం కుదింపు
- March 23, 2021
కువైట్: కరోనా కట్టడికి పాక్షిక కర్ఫ్యూ విధించిన కువైట్..కర్ఫ్యూ సమయంలో స్వల్ప మార్పులు చేసింది. ఇన్నాళ్లు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ పాటించారు. అయితే..ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. మార్చి 23(మంగళవారం ) నుంచి ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అలాగే కర్ఫ్యూ సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెస్టారెంట్లు డెలివరీ సర్వీసులను అందించొచ్చని స్పష్టం చేసింది. ఇక నివాస ప్రాంగణాల్లో సాయంత్రం 8 గంటల వరకు జనాలు బయట నడిచేందుకు అనుమతి ఉంటుంది. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. రెండు డోసులు తీసుకొని వారం రోజులు పూర్తైన వారు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే మొదటి డోసు మాత్రమే తీసుకుంటే ఐదు వారాల తర్వాతే క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







