పాక్షిక కర్ఫ్యూ సమయం కుదింపు
- March 23, 2021
కువైట్: కరోనా కట్టడికి పాక్షిక కర్ఫ్యూ విధించిన కువైట్..కర్ఫ్యూ సమయంలో స్వల్ప మార్పులు చేసింది. ఇన్నాళ్లు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ పాటించారు. అయితే..ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. మార్చి 23(మంగళవారం ) నుంచి ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అలాగే కర్ఫ్యూ సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెస్టారెంట్లు డెలివరీ సర్వీసులను అందించొచ్చని స్పష్టం చేసింది. ఇక నివాస ప్రాంగణాల్లో సాయంత్రం 8 గంటల వరకు జనాలు బయట నడిచేందుకు అనుమతి ఉంటుంది. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. రెండు డోసులు తీసుకొని వారం రోజులు పూర్తైన వారు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే మొదటి డోసు మాత్రమే తీసుకుంటే ఐదు వారాల తర్వాతే క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









