వ్యాక్సిన్ తీసుకోకుంటే పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి
- March 23, 2021
యూఏఈ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని వారు తప్పకుండా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని యూఏఈ ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలతో ప్రత్యక్షంగా కాంటాక్ట్ లో ఉండే రంగాల్లోని ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. హోటల్స్, రెస్టారెంట్లు, రవాణా, వైద్య రంగంలోని ఉద్యోగులతో పాటు లాండ్రీ, బ్యూటీ సెలూన్స్, హెయిర్ డ్రెస్సర్లు ప్రతి 14 రోజులకు ఓ సారి ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. మార్చి 28 నుంచి ఈ కొత్త నిర్ణయం అమలులోకి రానుంది. ఈ ఐదు రంగాల్లోని సంస్థలు, యజమానులు తమ సిబ్బంది తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకొని నెగటీవ్ రిపోర్ట్ తో విధులకు హజరయ్యేలా చర్యలు తీసుకోవాలని యూఏఈ మానవ వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..