ఈ-స్టోర్స్ నిర్వహించుకునేందుకు స్థానికులకు అనుమతి
- March 23, 2021
బహ్రెయిన్ : స్థానికులు ఈ-స్టోర్స్ ద్వారా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కార్మిక మంత్రిత్వ శాఖ, పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ-స్టోర్స్ నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. అయితే..బహ్రెయిన్ పౌరులకు మాత్రమే ఈ వెసులుబాటు ఇస్తున్నట్లు బహ్రెయిన్ యువరాజు సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలోని మంత్రివర్గం స్పష్టం చేసింది. ఆన్ లైన్ బిజినెస్ నిర్వహించే బహ్రెయినీయులకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. కుటుంబ అవసరాల మేరకు చేసే ఉత్పత్తులకు సంబంధించి స్టెప్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ తరహా ఉత్పత్తులు కార్మిక, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటాయి. ఇక రెండో ఆప్షన్ గా సిజిలి ఎంచుకోవాల్సి ఉంటుంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వర్చువల్ కమర్షియల్ యాక్టివిటీస్ అన్ని ఈ రెండో ఆప్షన్ పరిధిలోకి వస్తాయి. అయితే..ఈ రెండు ఆప్షన్లలోనూ బహ్రెయిన్ ఎంటర్ ప్రెన్యూర్ లు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ఫైనాన్సింగ్ ఇలా పలు ప్రయోజనాలు పొందవచ్చు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి