ఈ-స్టోర్స్ నిర్వహించుకునేందుకు స్థానికులకు అనుమతి
- March 23, 2021
బహ్రెయిన్ : స్థానికులు ఈ-స్టోర్స్ ద్వారా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కార్మిక మంత్రిత్వ శాఖ, పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ-స్టోర్స్ నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. అయితే..బహ్రెయిన్ పౌరులకు మాత్రమే ఈ వెసులుబాటు ఇస్తున్నట్లు బహ్రెయిన్ యువరాజు సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలోని మంత్రివర్గం స్పష్టం చేసింది. ఆన్ లైన్ బిజినెస్ నిర్వహించే బహ్రెయినీయులకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. కుటుంబ అవసరాల మేరకు చేసే ఉత్పత్తులకు సంబంధించి స్టెప్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ తరహా ఉత్పత్తులు కార్మిక, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటాయి. ఇక రెండో ఆప్షన్ గా సిజిలి ఎంచుకోవాల్సి ఉంటుంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వర్చువల్ కమర్షియల్ యాక్టివిటీస్ అన్ని ఈ రెండో ఆప్షన్ పరిధిలోకి వస్తాయి. అయితే..ఈ రెండు ఆప్షన్లలోనూ బహ్రెయిన్ ఎంటర్ ప్రెన్యూర్ లు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ఫైనాన్సింగ్ ఇలా పలు ప్రయోజనాలు పొందవచ్చు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







