ఈ-స్టోర్స్ నిర్వహించుకునేందుకు స్థానికులకు అనుమతి
- March 23, 2021
బహ్రెయిన్ : స్థానికులు ఈ-స్టోర్స్ ద్వారా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కార్మిక మంత్రిత్వ శాఖ, పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ-స్టోర్స్ నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. అయితే..బహ్రెయిన్ పౌరులకు మాత్రమే ఈ వెసులుబాటు ఇస్తున్నట్లు బహ్రెయిన్ యువరాజు సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలోని మంత్రివర్గం స్పష్టం చేసింది. ఆన్ లైన్ బిజినెస్ నిర్వహించే బహ్రెయినీయులకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. కుటుంబ అవసరాల మేరకు చేసే ఉత్పత్తులకు సంబంధించి స్టెప్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ తరహా ఉత్పత్తులు కార్మిక, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటాయి. ఇక రెండో ఆప్షన్ గా సిజిలి ఎంచుకోవాల్సి ఉంటుంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వర్చువల్ కమర్షియల్ యాక్టివిటీస్ అన్ని ఈ రెండో ఆప్షన్ పరిధిలోకి వస్తాయి. అయితే..ఈ రెండు ఆప్షన్లలోనూ బహ్రెయిన్ ఎంటర్ ప్రెన్యూర్ లు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ఫైనాన్సింగ్ ఇలా పలు ప్రయోజనాలు పొందవచ్చు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







