భారత 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..మార్చి 31 నుంచి ప్రారంభం
- March 26, 2021కువైట్ సిటీ:భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కువైట్లోని భారత రాయబార కార్యాలయం సిద్ధమవుతోంది. ఆనాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడులకలను నిర్వహించాలన్న భారత ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈ నెల 31 నుంచి వేడుకలను నిర్వహించనున్నారు. అయితే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్వాతంత్ర్య సన్నాహక వేడుకలను వర్చువల్ గానే నిర్వహిస్తారు. మార్చి 31న ఉదయం 10.30 గంటలకు ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ ప్రారంభం అవుతాయని వెల్లడించిన రాయబార కార్యాలయం..ఈ వేడుకల్లో కువైట్లోని భారతీయులు, భారత శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా పాల్గొనాలని కోరింది. వేడుకల్లో పార్టిసిపేట్ చేయాలనుకునేవారు మార్చి 31న 10.15 గంటలకు జూమ్ ద్వారా సెలబ్రేషన్స్ లో జాయిన్ అవ్వొచ్చని వివరించింది. రాయబార కార్యాలయం వెల్లడించిన జూమ్ లాగిన్ వివరాలు https://zoom.us/j/91423908856?pwd=d1Q1bDJEQkdKQVBLZExlSE9Qejgxdz09. మీటింగ్ కోడ్ 914 2390 8856 , మీటింగ్ ఐడీ 681987.
తాజా వార్తలు
- ఫైర్ ఫోర్స్ "ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్" క్యాంపెయిన్
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి