ఫేక్ ఈ-మెయిల్స్ తో జాగ్రత్త..ప్రజలకు ఎమిరేట్స్ పోస్ట్ హెచ్చరిక

- March 26, 2021 , by Maagulf
ఫేక్ ఈ-మెయిల్స్ తో జాగ్రత్త..ప్రజలకు ఎమిరేట్స్ పోస్ట్ హెచ్చరిక

యూఏఈ: కొందరు మోసగాళ్లు ప్రభుత్వ శాఖల పేరుతో నకిలీ ఈ-మెయిల్స్ పంపించి మోసం చేస్తున్నారని  ఎమిరేట్స్ పోస్ట్ ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ శాఖల పేరుతో ఫిషింగ్ ఈ-మెయిల్ పంపించి..వారి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు కావాలని కోరుతారు. ప్రభుత్వ శాఖల పేరుతో వచ్చిన మెయిల్ కనుక కొందరు బాధితులు అమాయకంగా వారి వివరాలను వెల్లడిస్తూ ఉంటారు. దీంతో బాధితుల వివరాలు తెలుసుకొని అకౌంట్లో డబ్బులు కాజేస్తుంటారని  ఎమిరేట్స్ పోస్ట్ వెల్లడించింది. ప్రజలు అలాంటి నకిలీ ఈ-మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఫిషింగ్ ఈ-మెయిల్స్ పంపుతున్న మోసగాళ్లను కనుగునేందుకు సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారని  ఎమిరేట్స్  పోస్ట్ వివరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com