ఫేక్ ఈ-మెయిల్స్ తో జాగ్రత్త..ప్రజలకు ఎమిరేట్స్ పోస్ట్ హెచ్చరిక
- March 26, 2021
యూఏఈ: కొందరు మోసగాళ్లు ప్రభుత్వ శాఖల పేరుతో నకిలీ ఈ-మెయిల్స్ పంపించి మోసం చేస్తున్నారని ఎమిరేట్స్ పోస్ట్ ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ శాఖల పేరుతో ఫిషింగ్ ఈ-మెయిల్ పంపించి..వారి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు కావాలని కోరుతారు. ప్రభుత్వ శాఖల పేరుతో వచ్చిన మెయిల్ కనుక కొందరు బాధితులు అమాయకంగా వారి వివరాలను వెల్లడిస్తూ ఉంటారు. దీంతో బాధితుల వివరాలు తెలుసుకొని అకౌంట్లో డబ్బులు కాజేస్తుంటారని ఎమిరేట్స్ పోస్ట్ వెల్లడించింది. ప్రజలు అలాంటి నకిలీ ఈ-మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఫిషింగ్ ఈ-మెయిల్స్ పంపుతున్న మోసగాళ్లను కనుగునేందుకు సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారని ఎమిరేట్స్ పోస్ట్ వివరించింది.

తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







