ఫేక్ ఈ-మెయిల్స్ తో జాగ్రత్త..ప్రజలకు ఎమిరేట్స్ పోస్ట్ హెచ్చరిక
- March 26, 2021
యూఏఈ: కొందరు మోసగాళ్లు ప్రభుత్వ శాఖల పేరుతో నకిలీ ఈ-మెయిల్స్ పంపించి మోసం చేస్తున్నారని ఎమిరేట్స్ పోస్ట్ ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ శాఖల పేరుతో ఫిషింగ్ ఈ-మెయిల్ పంపించి..వారి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు కావాలని కోరుతారు. ప్రభుత్వ శాఖల పేరుతో వచ్చిన మెయిల్ కనుక కొందరు బాధితులు అమాయకంగా వారి వివరాలను వెల్లడిస్తూ ఉంటారు. దీంతో బాధితుల వివరాలు తెలుసుకొని అకౌంట్లో డబ్బులు కాజేస్తుంటారని ఎమిరేట్స్ పోస్ట్ వెల్లడించింది. ప్రజలు అలాంటి నకిలీ ఈ-మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఫిషింగ్ ఈ-మెయిల్స్ పంపుతున్న మోసగాళ్లను కనుగునేందుకు సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారని ఎమిరేట్స్ పోస్ట్ వివరించింది.

తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







