క్వారంటైన్ కు మరో 2 హోటల్స్ కేటాయింపు..ఆగస్ట్ 31 నుంచి బుకింగ్స్
- March 26, 2021ఖతార్: క్వారంటైన్ ఉండేవాళ్ల కోసం ఖతార్ ప్రభుత్వం కొత్తగా మరో రెండు హోటల్స్ ను కేటాయించింది. క్వారంటైన్ గదుల సంఖ్యను పెంచేందుకు ది అవెన్యూ హోటల్, డబల్ ట్రీ హోటల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఖతార్లో క్వారంటైన్ హోటల్స్ సంఖ్య 62కి పెరిగింది. త్రీ, ఫోర్, ఫైవ్ స్టార్ కేటగిరిలలో 8,886 హోటల్ గదులు అందుబాటులోకి వచ్చాయి. క్వారంటైన్ ప్యాకేజీలు 2,300 నుంచి ప్రారంభం అవుతాయని, మూడు పూటల ఆహారం కూడా ప్యాకేజీలో భాగమని అధికారులు వివరించారు. ఇదిలాఉంటే..విదేశాలకు వెళ్లి తిరిగివచ్చే ఖతార్ పౌరులు, గ్రీన్ లిస్టులో లేని దేశాల నుంచి వచ్చే ప్రవాసీయులు ఖచ్చితంగా వారం పాటు తమ సొంత ఖర్చులతో క్వారంటైన్లో ఉండాలని ఖతార్ ఆదేశించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత