హీరోగా జర్నీ ప్రారంభమై 18ఏళ్లు.. ట్వీట్ చేసిన అల్లు అర్జున్‌

- March 28, 2021 , by Maagulf
హీరోగా జర్నీ ప్రారంభమై 18ఏళ్లు.. ట్వీట్ చేసిన అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌.. ఇప్పుడు టాలీవుడ్‌ స్టయిలీష్‌ స్టార్‌. తన అద్భుతమైన డాన్స్ లతో సౌత్‌ మొత్తాన్ని ఫిదా చేసిన హీరో. గతేడాది 'అల వైకుంఠపురములో' తో పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా నాన్‌ `బాహుబలి` రికార్డ్  లను తిరగరాసింది. ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ లో ఒకరిగా, మెగా ఫ్యామిలీ హీరోగా రాణిస్తున్న అల్లు అర్జున్‌ హీరోగా కెరీర్‌ స్టార్ట్ అయి సరిగ్గా 18ఏళ్లు అవుతుంది. 2003లో ఆయన హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. హీరోగా ఎంట్రీ ఇస్తూ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో బన్నీ నటించిన `గంగోత్రి` సినిమా 2003 మార్చి 28న విడుదలైంది. ఆదివారంతో ఇది 18ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ  జర్నీని గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ పెట్టారు.

'నా మొదటి సినిమా విడుదలై ఇప్పటికి 18ఏళ్లు అవుతుంది. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నా హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. నిజంగా ఇన్నేళ్లపాటు నాపై కురిపిస్తున్న ప్రేమని పొందడంలో నేను అదృష్టవంతుగా భావిస్తున్నా. మీ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు' అని సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టాడు బన్నీ. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంకా మరెన్నో విజయాలు సాధించి మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలి ఆశీర్వదిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com