కర్నూలు ఎయిర్పోర్టు లో రాకపోకలు షురూ!
- March 28, 2021
కర్నూల్: కర్నూల్లోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టు నుండి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి.
బెంగుళూరు నుండి కర్నూల్ కు తొలి విమానం ప్యాసింజర్లతో ఆదివారం నాడు చేరుకొంది. 52 మంది ప్రయాణీకులతో బెంగుళూరు నుండి కర్నూల్ కు ఇవాళ విమానం చేరుకొంది.
ఈ విమానంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేరుకొన్నారు. బెంగుళూరు నుండి కర్నూల్ కు 6ఈ7911 నెంబర్ విమానం చేరుకొంది. 52 మందితో తొలి విమానం కర్నూల్ కు చేరుకోవడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.
మరో వైపు ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు కర్నూల్ ఎయిర్ పోర్టు నుండి విశాఖపట్టణానికి తొలి విమానం బయలుదేరింది. రెండు రోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ ఎయిర్ పోర్టును ప్రారంభించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఈ ఎయిర్ పోర్టుకు పెడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ ఎయిర్ పోర్టు నుండి త్వరలోనే అన్ని ప్రాంతాలకు కూడ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం









