8 మంది మావోయిస్టులు హతం!
- February 29, 2016ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గొట్టెపాడు అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఈరోజు ఉదయం ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు మావోయిస్టులు ఎదురుకావడంతో ఇరు వర్గాలు ఎదురుకాల్పులకు పాల్పడ్డాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి ఏకే 47 సహా 8 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం చిన్నాపురం గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు