8 మంది మావోయిస్టులు హతం!
- February 29, 2016
ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గొట్టెపాడు అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఈరోజు ఉదయం ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు మావోయిస్టులు ఎదురుకావడంతో ఇరు వర్గాలు ఎదురుకాల్పులకు పాల్పడ్డాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి ఏకే 47 సహా 8 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం చిన్నాపురం గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









