8 మంది మావోయిస్టులు హతం!

- February 29, 2016 , by Maagulf
8 మంది మావోయిస్టులు హతం!

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో గొట్టెపాడు అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఈరోజు ఉదయం ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు మావోయిస్టులు ఎదురుకావడంతో ఇరు వర్గాలు ఎదురుకాల్పులకు పాల్పడ్డాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి ఏకే 47 సహా 8 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం చిన్నాపురం గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com