8 మంది మావోయిస్టులు హతం!
- February 29, 2016
ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గొట్టెపాడు అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఈరోజు ఉదయం ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు మావోయిస్టులు ఎదురుకావడంతో ఇరు వర్గాలు ఎదురుకాల్పులకు పాల్పడ్డాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి ఏకే 47 సహా 8 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం చిన్నాపురం గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









