పాఠశాల బస్సును ఢీకొన్న లారీ : 40 మందికి గాయాలు

- February 29, 2016 , by Maagulf
పాఠశాల బస్సును ఢీకొన్న లారీ :  40 మందికి గాయాలు

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తల్లాడ-దేవరపల్లి రహదారిపై ఈరోజు ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ సహా 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను జంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాల బస్సు అప్రమత్తతగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com