ఆదాయపు పన్ను రూమర్లపై స్పందించిన ఒమన్
- March 30, 2021
ఒమన్: సోషల్ మీడియా వేదికగా ఆదాయపు పన్ను విషయమై జరుగుతున్న దుష్ప్రచారంపై ఒమన్ స్పందించింది. అత్యధిక ఆదాయాన్ని ఆర్జించేవారిపై అదనపు పన్నుల భారం 2022 నుంచి మోపబోతున్నట్లు ప్రచారం జరుగుతుండడాన్ని ఒమన్ ఖండించింది. ఆదాయపు పన్నుని జీసీసీ దేశాల్లో ఎవరూ ఆదాయపు పన్ను వసూలు చేయడంలేదు. వ్యక్తిగత ఆదాయంపై ఒమన్ పన్నులు వసూలు చేయడంలేదనీ, క్యాపిటల్ గెయిన్స్, వెల్త్, డెత్ ఆఫ్ ప్రాపర్టీ, నాన్ రెసిడెంట్ ఇండివిడ్యువల్స్ (10 శాతం ట్యాక్స్ కొన్ని పరిమితులకు లోబడి) వంటి విభాగాల్లోనూ పన్నులు లేవని అధికారులు వివరించారు. సంస్థలు, ొమన్ కంపెనీలు సహా పలు విభాగాలపై 15 శాతం ట్యాక్స్ విధిస్తున్నారు. చిన్న పన్ను చెల్లింపుదారులకు 3 శాతం ట్యాక్స్ లేదా పూర్తిగా ట్యాక్స్ లేకపోవడం కూడా వుంది. పెట్రోలియం ఆపరేషన్స్ సంస్థలకు 55 శాతం ట్యాక్స్ వుంటుంది. పుకార్లను ఎవరూ నమ్మరాదని, అధికారిక వేదికల నుంచే సరైన సమాచారం అందుతుందని అథారిటీస్ స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









