భారత్ లో కరోనా కేసుల వివరాలు

- April 03, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.కరోనా కట్టడికి వ్యాక్సిన్ అందిస్తున్నా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.తాజాగా దేశంలో 89,129 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కి చేరింది.ఇందులో 1,15,69,241 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,58,909 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 44,202 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.ఇకపోతే, గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 714 మంది మృతి చెందారు.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,64,110కి చేరింది.ఇక ఇదిలా ఉంటె, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 7,30,54,295 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు.గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కేసుల్లో భారీగా నమోదయ్యాయి.ఆ స్థాయిలో కేసులు మరలా ఇప్పుడు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com