భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 03, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.కరోనా కట్టడికి వ్యాక్సిన్ అందిస్తున్నా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.తాజాగా దేశంలో 89,129 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కి చేరింది.ఇందులో 1,15,69,241 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,58,909 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 44,202 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.ఇకపోతే, గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 714 మంది మృతి చెందారు.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,64,110కి చేరింది.ఇక ఇదిలా ఉంటె, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 7,30,54,295 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు.గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కేసుల్లో భారీగా నమోదయ్యాయి.ఆ స్థాయిలో కేసులు మరలా ఇప్పుడు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







