దుబాయ్ని ఉర్రూతలూగించనున్న 'అనిరుధ్'
- March 01, 2016
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, దుబాయ్లో సంగీత ప్రియుల్ని లైవ్ కాన్సెర్ట్ ద్వారా అలరించనున్నాడు. బ్రాండ్ అవతార్ - బ్రాండింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఏప్రిల్ 29న అనిరుధ్ లైవ్ కాన్సెర్ట్ నిర్వహించనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 29న ప్రెస్మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అనిరుధ్ పాల్గొన్నాడు. దుబాయ్లో తొలిసారి లైవ్ కాన్సెర్ట్ నిర్వహించనున్నాననీ, కాన్సెర్ట్కి ముందే తనకు వస్తున్న ఈ రెస్పాన్స్ చూసి చాలా సంతోషిస్తున్నానని అనిరుధ్ చెప్పాడు. సంగీతాభిమానుల్ని అలరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని అన్నాడు అనిరుధ్. దుబాయ్ వాసుల నుంచి తనకు దక్కిన ఈ ఆహ్వానం పట్ల ఉబ్బితబ్బిబ్బవుతున్నట్లు అనిరుధ్ వెల్లడించాడు. ఏప్రిల్ 29న సాయంత్రం 6 గంటల నుంచి లైవ్ కాన్సెర్ట్ జరుగుతుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. 6500 సీటింగ్తో పవర్ ప్యాక్డ్ మ్యూజిక్ జల్సా జరగనుంది. బ్రాండ్ అవతార్ సీఈఓ హేమచంద్రన్ మాట్లాడుతూ, అనిరుధ్ని పవర్హౌస్ ఆఫ్ టాలెంట్గా అభివర్ణించారు. తెలుగు, తమిళ సినీ ప్రేక్షకుల్నే కాక, ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియుల్ని అలరించిన అనిరుధ్ దుబాయ్లో సంచలనం సృష్టించబోతున్నాడని ఆయన అన్నారు. రెహా మ్యూజిక్ మరియు డాన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ సహకారంతో బ్రాండ్ అవతార్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది. 8 నుంచి 15 ఏళ్ళ గ్రూప్, 16 నుంచి 30 గ్రూప్లకు డాన్సింగ్, సింగింగ్, ఇన్స్ట్రుమెంటల్ ప్లేయింగ్ విభాగాల్లో అవకాశం కల్పిస్తారు. విజేతలకు అనిరుధ్ చేతుల మీదుగా బహుమతులు అందించనున్నారు. అలాగే, మంచి టాలెంట్ కనబర్చినవారికి అనిరుధ్తో కలిసి స్టేజ్పై పెర్ఫామ్ చేసే అవకాశం లభించనుంది.



తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









