నష్టాల్లో ముగిసిన భారత్ స్టాక్ మార్కెట్లు

- April 05, 2021 , by Maagulf
నష్టాల్లో ముగిసిన భారత్ స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ, అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ వెరసి సోమవారం కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 870 పాయింట్లు కోల్పోయి 49,159 వద్దకు చేరగా నిఫ్టీ 229 పాయింట్ల మేర నష్టంతో 14,637 వద్ద స్థిరపడ్డాయి. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలు బుధవారం వెల్లడి కానున్న నేపధ్యంలో మార్కెట్లలో అప్రమత్తత కొనసాగింది. తాజా వారం తొలి ట్రేడింగ్ సెషన్ లో గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నడుమ నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఆద్యంతం బలహీన ధోరణిని కొనసాగించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com