జపాన్లో కరోనా ఫోర్త్ వేవ్..
- April 05, 2021
టోక్యో:జపాన్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మరో మూడున్నర నెలల్లో ఒలింపిక్స్ మొదలుకానున్న తరుణంలో కరోనా నాలుగో వేవ్ అలజడి సృష్టిస్తోంది. నిరంతరం పెరుగుతున్న కేసులతో అల్లాడుతున్న తరుణంలోనే.. కొత్తరకం వైరస్ వేరియంట్లు భయపడుతున్నాయి. నిత్యం జపాన్లో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు ఎప్పటికప్పుడు కొత్త మ్యుటేషన్లు వెలుగులోకి వస్తుండటంతో కలవరం మొదలైంది.
ఈ నేపథ్యంలో జపాన్లోని కొన్ని ప్రాంతాల్లో బ్రిటన్ వేరియంట్ కేసులు అధికంగా నమోదు అవుతుండడం పట్ల నిపుణులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఒసాకా నగరంలో ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఈక్’ మ్యుటేషన్ వెలుగులోకి వచ్చింది. టోక్యో నగరంతోపాటు మరికొన్ని చోట్ల ఈక్ మ్యుటేషన్ విస్తరిస్తోంది. అయితే.. టోక్యోలో వెలుగులోకి వస్తున్న కరోనా కేసుల్లో 70 శాతం కేసుల్లో ఈక్ వేరియంట్ నిర్థారణ అయినట్లు జపాన్ అధికారులు తెలిపారు. అయితే ఈ మ్యుటేషన్ వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని కూడా తగ్గించేస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. టోక్యో మెడికల్ అండ్ డెంటల్ యూనివర్శిటీ ఆసుపత్రిలో మార్చిలో ఈక్ న్యూస్ట్రేయిన్ను కనుగొన్నారు.14 మంది కోవిడ్ -19 రోగులలో 10 మందిలో E484K మ్యుటేషన్ ఉన్నట్లు గుర్తించారు. అప్పటినుంచి ఈ కొత్తరకం కేసులు భారీగా పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







