ప్రీతి జింటా ఓ ఇంటిదైంది..
- March 01, 2016
'క ల్ హో నా హో', 'క్యా కెహనా', 'వీర్ జారా' లాంటి సినిమాలతో బాలీవుడ్లోను, 'రాజకుమారుడు', 'ప్రేమంటే ఇదేరా' లాంటి చిత్రాలతో టాలీవుడ్లోనూ మంచి పేరు తెచ్చుకున్న కథానాయిక ప్రీతి జింటా. ఈ సొట్ట బుగ్గల సుందరి పెళ్లి కూతురైంది. తన బాయ్ఫ్రెండ్ జెనీ గుడ్ఇనఫ్ను వివాహం చేసుకొని ఓ ఇంటిదైంది. లాస్ఏంజిలెస్లో స్నేహితులు, బంధువుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వేడుక నిర్వహించారు. జెనీ అమెరికాకు చెందిన హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్తు సంస్థలో సీనియర్ ఉపాధ్యక్షుడు. వీరి వివాహంపై గత కొద్దికాలంగా వార్తలు వస్తున్నా ప్రీతి ధ్రువీకరించలేదు.ఆఖరికి ప్రీతి జింటా స్నేహితుడు కబీర్ బేడీ ప్రీతికి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్తో పెళ్లి విషయం తెలిసింది. పెళ్లి ఎప్పుడు జరిగిందనే విషయంలో స్పష్టతలేదు. 2014లో వచ్చిన 'హ్యాపీ ఎండింగ్'లో అతిథి పాత్రలో కనిపించిన తర్వాత ప్రీతి మళ్లీ సినిమాల్లో నటించలేదు. 2008లో వ్యాపారవేత్తగా మారిన ప్రీతి ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సహ యజమానిగా ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







