టీటీడీ సంచలన నిర్ణయం..
- April 07, 2021తిరుమల: కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్(ఎస్ఎస్డి) టోకెన్ల జారీని వచ్చే సోమవారం అనగా ఏప్రిల్ 12వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది. తిరుపతి నగరంలో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది.
ప్రతీ రోజూ తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. దీని వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఈ పరిస్థితుల్లో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరిగి సర్వదర్శనం టోకెన్ల ఎప్పుడు జారీ చేసేది ముందుగానే తెలియజేస్తామని తెలిపింది. కాగా, మహారాష్ట్రలో కరోనా కేసులు ఉధృతమవుతున్న క్రమంలో షిర్డీ ఆలయ దర్శనాన్ని కూడా నిలిపేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14