కర్ఫ్యూ నుంచి దోబీ షాపుల మినహాయింపు ఇవ్వాలని ఓనర్ల వినతి
- April 08, 2021కువైట్ సిటీ:కోవిడ్ సంక్షోభంతో ఇప్పటికే ఆర్ధికంగా చితికిపోయిన తమకు కర్ఫ్యూ నిబంధనలు మరింత ఆర్ధికంగా చిదిమేస్తున్నాయని కువైతీ లాండరీ షాపు ఓనర్ల ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తమకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కరోనా ఎమర్జెన్సీ కమిటీకి లేఖ రాసింది. తాము అన్ని కోవిడ్ నిబంధనలు పాటించి షాపులను నిర్వహించుకుంటామని, ప్రజల ఆరోగ్య భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించబోమంటూ ఆ లేఖలో ఫెడరేషన్ స్పష్టం చేసింది. కోవిడ్ రేపిన ఆర్ధిక దుమారంలో ఇప్పటికే చాలా మంది లాండరీ ఓనర్లు షాపులు మూసేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ప్రభుత్వం తమ పట్ల ఉదారంగా ఆలోంచాల్సిన అవసరం ఉందని వేడుకున్నారు. తమ ఫెడరేషన్ లో 3000 లాండరీ షాపులు ఉటే కొవిడ్ సంక్షోభ కాలంలో 50 షాపులు పూర్తిగా మూతపడ్డాయని, సిబ్బందికి జీతాలు చెల్లించలేక 400 లాండరీ షాపులను తాత్కాలికంగా మూసివేశారని ఫెడరేషన్ మెంబర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు