కర్ఫ్యూ నుంచి దోబీ షాపుల మినహాయింపు ఇవ్వాలని ఓనర్ల వినతి
- April 08, 2021
కువైట్ సిటీ:కోవిడ్ సంక్షోభంతో ఇప్పటికే ఆర్ధికంగా చితికిపోయిన తమకు కర్ఫ్యూ నిబంధనలు మరింత ఆర్ధికంగా చిదిమేస్తున్నాయని కువైతీ లాండరీ షాపు ఓనర్ల ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తమకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కరోనా ఎమర్జెన్సీ కమిటీకి లేఖ రాసింది. తాము అన్ని కోవిడ్ నిబంధనలు పాటించి షాపులను నిర్వహించుకుంటామని, ప్రజల ఆరోగ్య భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించబోమంటూ ఆ లేఖలో ఫెడరేషన్ స్పష్టం చేసింది. కోవిడ్ రేపిన ఆర్ధిక దుమారంలో ఇప్పటికే చాలా మంది లాండరీ ఓనర్లు షాపులు మూసేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ప్రభుత్వం తమ పట్ల ఉదారంగా ఆలోంచాల్సిన అవసరం ఉందని వేడుకున్నారు. తమ ఫెడరేషన్ లో 3000 లాండరీ షాపులు ఉటే కొవిడ్ సంక్షోభ కాలంలో 50 షాపులు పూర్తిగా మూతపడ్డాయని, సిబ్బందికి జీతాలు చెల్లించలేక 400 లాండరీ షాపులను తాత్కాలికంగా మూసివేశారని ఫెడరేషన్ మెంబర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









