కర్ఫ్యూ నుంచి దోబీ షాపుల మినహాయింపు ఇవ్వాలని ఓనర్ల వినతి
- April 08, 2021
కువైట్ సిటీ:కోవిడ్ సంక్షోభంతో ఇప్పటికే ఆర్ధికంగా చితికిపోయిన తమకు కర్ఫ్యూ నిబంధనలు మరింత ఆర్ధికంగా చిదిమేస్తున్నాయని కువైతీ లాండరీ షాపు ఓనర్ల ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తమకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కరోనా ఎమర్జెన్సీ కమిటీకి లేఖ రాసింది. తాము అన్ని కోవిడ్ నిబంధనలు పాటించి షాపులను నిర్వహించుకుంటామని, ప్రజల ఆరోగ్య భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించబోమంటూ ఆ లేఖలో ఫెడరేషన్ స్పష్టం చేసింది. కోవిడ్ రేపిన ఆర్ధిక దుమారంలో ఇప్పటికే చాలా మంది లాండరీ ఓనర్లు షాపులు మూసేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ప్రభుత్వం తమ పట్ల ఉదారంగా ఆలోంచాల్సిన అవసరం ఉందని వేడుకున్నారు. తమ ఫెడరేషన్ లో 3000 లాండరీ షాపులు ఉటే కొవిడ్ సంక్షోభ కాలంలో 50 షాపులు పూర్తిగా మూతపడ్డాయని, సిబ్బందికి జీతాలు చెల్లించలేక 400 లాండరీ షాపులను తాత్కాలికంగా మూసివేశారని ఫెడరేషన్ మెంబర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ







