స్కూల్ స్టాఫ్ వారానికోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే!
- April 08, 2021దుబాయ్: ఇక నుంచి ప్రతి విద్యాసంస్థలోని సిబ్బంది ఖచ్చితంగా ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని దుబాయ్ విజ్ఞాన, నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు అన్ని అర్హతలు ఉండి కూడా వ్యాక్సిన్ తీసుకొని వాళ్లందరికి ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దుబాయ్ పరిధిలోని ప్రాథమిక తరగతుల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ నియమం వర్తిస్తుంది. ఆన్ లైన్ క్లాసులు చెప్పే టీచర్లు కూడా ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాల్సిందే. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆ వెంటనే పీసీఆర్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే..నిబంధనల మేరకు వ్యాక్సిన్ వేయించుకునేందుకు అర్హులు కాని వారు...ఇప్పటికే ఫస్ట్ డోస్ వేయించుకున్న వారికి మాత్రం పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం