స్కూల్ స్టాఫ్ వారానికోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే!
- April 08, 2021
దుబాయ్: ఇక నుంచి ప్రతి విద్యాసంస్థలోని సిబ్బంది ఖచ్చితంగా ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని దుబాయ్ విజ్ఞాన, నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు అన్ని అర్హతలు ఉండి కూడా వ్యాక్సిన్ తీసుకొని వాళ్లందరికి ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దుబాయ్ పరిధిలోని ప్రాథమిక తరగతుల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ నియమం వర్తిస్తుంది. ఆన్ లైన్ క్లాసులు చెప్పే టీచర్లు కూడా ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాల్సిందే. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆ వెంటనే పీసీఆర్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే..నిబంధనల మేరకు వ్యాక్సిన్ వేయించుకునేందుకు అర్హులు కాని వారు...ఇప్పటికే ఫస్ట్ డోస్ వేయించుకున్న వారికి మాత్రం పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







