స్కూల్ స్టాఫ్ వారానికోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే!
- April 08, 2021
దుబాయ్: ఇక నుంచి ప్రతి విద్యాసంస్థలోని సిబ్బంది ఖచ్చితంగా ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని దుబాయ్ విజ్ఞాన, నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు అన్ని అర్హతలు ఉండి కూడా వ్యాక్సిన్ తీసుకొని వాళ్లందరికి ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దుబాయ్ పరిధిలోని ప్రాథమిక తరగతుల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ నియమం వర్తిస్తుంది. ఆన్ లైన్ క్లాసులు చెప్పే టీచర్లు కూడా ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాల్సిందే. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆ వెంటనే పీసీఆర్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే..నిబంధనల మేరకు వ్యాక్సిన్ వేయించుకునేందుకు అర్హులు కాని వారు...ఇప్పటికే ఫస్ట్ డోస్ వేయించుకున్న వారికి మాత్రం పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









