ప్రైవేట్ వైద్య సంస్థల్లో కోవిడ్ టెస్ట్ రేట్లపై ఖతార్ ప్రభుత్వం క్లారిటీ
- April 08, 2021
దోహా: కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య సంస్థలపై భారం తగ్గించటంతో పాటు..ప్రజలకు కూడా త్వరతగతిన సేవలు అందించే ఉద్దేశంతో ఖతార్ ప్రభుత్వం కోవిడ్ టెస్టులపై కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో విదేశాలకు వెళ్లే వారికి పీసీఆర్ టెస్టులు చేయబోమంటూ ప్రకటించింది. వాళ్లందరూ ప్రైవేట్ వైద్య కేంద్రాల్లో టెస్టులు చేయించుకోవాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే..కోవిడ్ టెస్టుల కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేట్ వైద్య కేంద్రాలు పీసీఆర్ టెస్టుల రేట్లను ఇష్టానుసారంగా వసూలు చేయకుండా నియంత్రించేందుకు కోవిడ్ టెస్టుల చార్జీలను QR 300కి ఫిక్స్ చేసింది. అంతకుమించి ఎక్కువ డబ్బులు వసూలు చేయకూడదని ఆదేశించింది. అదేవిధంగా మరో 40 వైద్యసంస్థలకు కోవిడ్ టెస్టులు చేసే అవకాశాన్ని కల్పిస్తూ అనుమతి మంజూరు చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









