ప్రైవేట్ వైద్య సంస్థల్లో కోవిడ్ టెస్ట్ రేట్లపై ఖతార్ ప్రభుత్వం క్లారిటీ
- April 08, 2021దోహా: కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య సంస్థలపై భారం తగ్గించటంతో పాటు..ప్రజలకు కూడా త్వరతగతిన సేవలు అందించే ఉద్దేశంతో ఖతార్ ప్రభుత్వం కోవిడ్ టెస్టులపై కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో విదేశాలకు వెళ్లే వారికి పీసీఆర్ టెస్టులు చేయబోమంటూ ప్రకటించింది. వాళ్లందరూ ప్రైవేట్ వైద్య కేంద్రాల్లో టెస్టులు చేయించుకోవాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే..కోవిడ్ టెస్టుల కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేట్ వైద్య కేంద్రాలు పీసీఆర్ టెస్టుల రేట్లను ఇష్టానుసారంగా వసూలు చేయకుండా నియంత్రించేందుకు కోవిడ్ టెస్టుల చార్జీలను QR 300కి ఫిక్స్ చేసింది. అంతకుమించి ఎక్కువ డబ్బులు వసూలు చేయకూడదని ఆదేశించింది. అదేవిధంగా మరో 40 వైద్యసంస్థలకు కోవిడ్ టెస్టులు చేసే అవకాశాన్ని కల్పిస్తూ అనుమతి మంజూరు చేసింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు