ప్రైవేట్ వైద్య సంస్థల్లో కోవిడ్ టెస్ట్ రేట్లపై ఖతార్ ప్రభుత్వం క్లారిటీ
- April 08, 2021
దోహా: కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య సంస్థలపై భారం తగ్గించటంతో పాటు..ప్రజలకు కూడా త్వరతగతిన సేవలు అందించే ఉద్దేశంతో ఖతార్ ప్రభుత్వం కోవిడ్ టెస్టులపై కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో విదేశాలకు వెళ్లే వారికి పీసీఆర్ టెస్టులు చేయబోమంటూ ప్రకటించింది. వాళ్లందరూ ప్రైవేట్ వైద్య కేంద్రాల్లో టెస్టులు చేయించుకోవాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే..కోవిడ్ టెస్టుల కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేట్ వైద్య కేంద్రాలు పీసీఆర్ టెస్టుల రేట్లను ఇష్టానుసారంగా వసూలు చేయకుండా నియంత్రించేందుకు కోవిడ్ టెస్టుల చార్జీలను QR 300కి ఫిక్స్ చేసింది. అంతకుమించి ఎక్కువ డబ్బులు వసూలు చేయకూడదని ఆదేశించింది. అదేవిధంగా మరో 40 వైద్యసంస్థలకు కోవిడ్ టెస్టులు చేసే అవకాశాన్ని కల్పిస్తూ అనుమతి మంజూరు చేసింది.
తాజా వార్తలు
- హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం..
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ









