న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- April 08, 2021
వెల్లింగ్టన్: భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.భారత ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 28 వరకు భారత్ ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని జెసిందా ఆర్డెన్ పేర్కొన్నారు. భారత్ లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. భారత్ ప్రయాణికులు కాకుండా, భారత్ నుంచి వచ్చే న్యూజిలాండ్ దేశస్తులపై కూడా ఈ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా ఇండియాలో 1,26,789 కరోనా కేసులు, 685 మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో ఇండియా టాప్ లో ఉండటం విశేషం.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్









