న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- April 08, 2021వెల్లింగ్టన్: భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.భారత ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 28 వరకు భారత్ ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని జెసిందా ఆర్డెన్ పేర్కొన్నారు. భారత్ లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. భారత్ ప్రయాణికులు కాకుండా, భారత్ నుంచి వచ్చే న్యూజిలాండ్ దేశస్తులపై కూడా ఈ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా ఇండియాలో 1,26,789 కరోనా కేసులు, 685 మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో ఇండియా టాప్ లో ఉండటం విశేషం.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి