న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- April 08, 2021
వెల్లింగ్టన్: భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.భారత ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 28 వరకు భారత్ ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని జెసిందా ఆర్డెన్ పేర్కొన్నారు. భారత్ లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. భారత్ ప్రయాణికులు కాకుండా, భారత్ నుంచి వచ్చే న్యూజిలాండ్ దేశస్తులపై కూడా ఈ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా ఇండియాలో 1,26,789 కరోనా కేసులు, 685 మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో ఇండియా టాప్ లో ఉండటం విశేషం.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









