ఏపీలో కరోనా కేసుల వివరాలు
- April 08, 2021ఏపీలో కొత్త కరోనా కేసుల వివరాలు
అమరావతి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.ఈరోజు కూడా కరోనా కేసులు రెండు వేలు దాటేశాయి.గడిచిన 24గంటల్లో 2558మందికి కరోనా సోకింది.ఇక, అదే స్థాయిలోనూ యాక్టివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో ప్రస్తుతం 14,913 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.ఇక, గడిచిన 24గంటల్లో ఆరుగురు మృత్యువాత పడగా, మొత్తం మృతుల సంఖ్య 7268కి చేరింది.గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇక, అనంతపురంలో 131, చిత్తూరులో 465, తూర్పుగోదావరిలో 58, గుంటూరులో 399, కడపలో 94, కృష్ణాలో 152, కర్నూలులో 344, నెల్లూరులో 204, ప్రకాశంలో 153, శ్రీకాకుళంలో 185, విశాఖలో 290, విజయనగరంలో 46, పశ్చిమగోదావరిలో 37 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ